News

మంత్రిని హతమార్చిన కూలీలు


ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో బొలివియాలో డిప్యూటీ హోంమంత్రిని హతమార్చారు గనికార్మికులు. ఈ విషయాన్ని బొలివియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అధిక రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ బొలివియాలోని గనికార్మికులు గత మంగళవారం నుంచి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హైవేలపై ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు పండురో ప్రాంతంలో డిప్యూటీ హోంమంత్రి రొడాల్ఫో ఇలేన్స్‌, అతడి వ్యక్తిగత సిబ్బందిని కిడ్నాప్‌ చేశారు. రొడాల్ఫోను కార్మికులు అతిదారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనతో స్థానికంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.ఈ సందర్భంగా పోలీసులు, గనికార్మికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.